ఫ్లోరైడ్ వాటర్ పై విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అవగాహన కల్పించారు. గురువారం కనిగిరి నియోజకవర్గం లోని కమ్మవారిపాలెం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ రాజాబాబు విద్యార్థులకు ఫ్లోరైడ్ నీళ్లను తాగడం వల్ల కలుగు అనార్థాలను వివరించి ఇకనుంచి పాఠశాలలో ఫిల్టర్ చేసే నీళ్లను మాత్రమే తాగాలని విద్యార్థులకు తెలిపారు. నీటి ట్యాంకర్ల ద్వారా పాఠశాలకు మంచినీటిని సరఫరా చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇటీవల 9 మంది విద్యార్థులు కామెర్ల బారిన పడటంతో కలెక్టర్ రాజాబాబు గురువారం కనిగిరిలో పర్యటించారు.