ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామ శివారులో కోతముక్క పేకాట ఆడుతున్న 9 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ సీఐ సుధాకర్రావు ఆధ్వర్యంలో ఎస్సై సుదర్శన్, ఏఎస్ఐ మహబూబ్ బాషా, సిబ్బంది రైతుళ్లా వేషాలు వేసుకుని మరీ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ.4490 నగదు స్వాధీనం చేసుకుని 9 మందిని కొత్తపట్నం పోలీసులకు అప్పగించారు.