ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం మేనెక్కకు తీసుకునే వరకు ఉద్యమం ఆగదన్నారు. ఈనెల 28వ తేదీ నియోజకవర్గ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.