గిద్దలూరు: కొమరోలు మండలంలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని శ్రీనివాసులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరమ్మత్తుల కారణంగా తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పొట్టి పల్లి కంకరవాని పల్లి గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.