శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండల కేంద్రంలో ఉన్న గిర్రాజు కాలనీలో వేడివేడి పాలు మీద పడడంతో విశ్వానంద అనే బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. దీంతో ఆ బాలుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సోమవారం మధ్యాహ్నం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.