నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట భిక్షాటన చేసి నిరసన తెలిపిన పారిశుద్ధ్య కార్మికులు
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి యదుట తమకు జీతాలు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న అధికార యంత్రాంగం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారికి కనీస కనికరం రావాలని తట్టలు పట్టి భిక్షాటన చేసి తమకు న్యాయం చేయండి మహాప్రభువు అంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట బైఠాయించి పారిశుద్ధ్య కార్మికులు నిరసనను వ్యక్తం చేశారు. వారి కష్టాన్ని చూసి స్థానికులు తమకు తోచిన సహకారం అందించారు.