నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో అయ్యప్ప నామస్మరణంతో శనివారం మారు మోగింది మండల పరిధిలో సుమారు 41 మంది అయ్యప్ప స్వాములు 41 రోజులుగా స్వాములు ప్రతిరోజూ అత్యంత నియమ నిష్ఠలతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు, దీక్ష విరమణ లో భాగంగా శనివారం సాంప్రదాయ బద్ధంగా ఇరుముడి కట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టారు, అయ్యప్ప శరణు ఘోషల మధ్య ప్రత్యేక వాహనంలో శబరిమలకు బయలుదేరారు