అనంతపురం నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో తిరుగుతున్న శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని గాండ్లపెంట మండలం కు చెందిన పదహారేళ్ల బాలికను గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు గురువారం రాత్రి అప్పగించారు. గాండ్లపెంట పోలీస్ స్టేషన్ లో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.