అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో చోలసముద్రం గ్రామానికి చెందిన మురళి నాయక్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.