రాయదుర్గం: పట్టణంలోని పోలీసు స్టేషన్ లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కల్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు లాంఛనంగా ప్రారంభించి అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం అమరుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున యువత తరలివచ్చి రక్తదాన చేయడం అభినందనీయమన్నారు. సిఐ జయనాయక్, వెంకటరమణ, ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు.