అనంతపురం నగరంలో విద్యుత్ వినియోగం రోజు రోజుకీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో నాణ్యమైన సరఫరా కోసం అదనపు విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే అధికారుల ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేయించిన ఎమ్మెల్యే మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో విజయవాడలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కలిశారు. నగరంలో విద్యుత్ డిమాండ్ను ఎక్కువగా ఉందని, నివాస మరియు వాణిజ్య రంగాలకు నిరంతరాయంగా సరఫరాను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఐదు అదనపు 33/11KV విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేయాలని కోరారు.