పూతలపట్టు: కాణిపాకం స్వామివారిని దర్శించుకున్న చిత్తూరు జిల్లా మాజీ ఎస్పీ మణికంఠ చందోలు
చిత్తూరు జిల్లా మాజీ ఎస్పీ మణికంఠ చందోలు సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సీ.ఐ శ్రీధర్ నాయుడు, ఎస్సై నరసింహులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.