ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం సమీపంలో ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. దేవలోటి వద్ద బీడ్ పొలాలలో మేతకు వెళ్ళిన ఆవులు మందపై పెద్దపులి దాడి చేసింది ఇందులో ఓ ఆవు మృతి చెందినట్లుగా బాధితులు తెలిపారు. తరచు పెద్దపులి దాడులు జరుగుతున్న నేపథ్యంలో సమీప ప్రాంతంలోని రైతులతో పాటు పశువుల కాపరుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు స్పందించాల్సి ఉందని స్థానికులు తెలిపారు.