ప్రకాశం జిల్లా లో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీసులు శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు అరికట్టే అంశంలో ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. అలానే స్థానిక పరిస్థితులపై ప్రజలతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అలానే కొత్త వ్యక్తులు ఫోన్ చేసి మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు ఓటిపి నంబరు అడిగితే చెప్పవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు మీ పిల్లలు బానిస కాకుండా జాగ్రత్త వహిస్తూ తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.