కదిరిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 28, 2025
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో లోకేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. యువకుడి పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.