రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని దొర్నిపాడు మండల వ్యవసాయ అధికారిని ప్రమీల పేర్కొన్నారు గురువారం నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల మహిళ సమైక్య కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై మహిళలు రైతులకు అవగాహన నిర్వహించారు అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు ఖర్చులు తగ్గింపు నేల సారవంతత పెంపు, దీర్ఘకాలిక ఆదాయ అవకాశాల గురించి వివరించారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు మహిళ సమైక్య సిబ్బంది రైతులు పాల్గొన్నారు