అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని హనుమేష్ నగర్ కు చెందిన మహబూబ్ బాషా అనే వ్యక్తికి చెందిన రాయల్ ఇన్ఫిల్డ్ బుల్లెట్ బైక్ చోరీకి గురైంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమరాలలో రికార్డు స్పష్టంగా అయ్యాయి. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని హనుమేష్ నగర్ కు చెందిన మహబూబ్ బాష కాంట్రాక్టు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే తన ఇంటి ముందు బుల్లెట్ బైక్ ను నిలిపి ఉంచి ఇంట్లో నిద్రించాడు. అయితే గురువారం వేకువ జామున 4 గంటల 17 నిమిషాల సమయంలో ఇంటి బయట నిలిపి ఉంచిన రూ.2.50లక్షలు విలువ చేసే తన రాయల్ ఇన్ఫిల్డ్ బైక్ ను చోరీ చేశారు.