గుంతకల్లు: రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన గుత్తి విద్యార్థిని, అభినందించిన ఉపాధ్యాయులు
గుత్తిలోని కర్నూలు రోడ్డులో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇందూ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ ఎం సుంకన్న చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలో సోమవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన ఇందూ ను ఫిజికల్ డైరెక్టర్లు సరోజ, శ్యామల, లోకేశ్వరి, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.