మత్తు పదార్థాల అవగాహనపై ఆత్మకూరు పట్టణంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పట్టణంలోని పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. మత్తుపదార్థాలు తీసుకొని చనిపోయిన వ్యక్తి బొమ్మను తయారుచేసి పాడేమోస్తూ పాడె ముందు ఏడ్చుకుంటూ విద్యార్థులు చేసిన అవగాహన కార్యక్రమం పట్టణవాసులను ఆకర్షితులను చేసింది. పట్టణంలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాల పాత బస్టాండ్ గౌడ్ సెంటరు, బస్టాండ్ మీదుగా ఈ ర్యాలీ సాగింది. అవగాహన మత్తు పదార్థాల అవగాహనపై ప్రజలకు నినాదాలు చేస్తూ విద్యార్థులు అవగాహన కల్పించారు.