ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన పదవ తరగతి విద్యార్థి కర్ణ కొద్దిగ రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అర్ధవీడులోని గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి దృష్టికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీసుకువెళ్లారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు మంత్రి స్వామి ముందుకు వచ్చి రూ. 3 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శనివారం టిడిపి కార్యాలయంలో విద్యార్థి కుటుంబానికి అందజేశారు.