జోగన్న గారి పేట వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సుమో వాహనం, వ్యక్తికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Sep 28, 2025
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం లోని నల్లచెరువు మండలం జోగన్న గారి పేట వద్ద ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి సుమో వాహనం ఢీకొన్న ఘటనలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.