పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ను శనివారం తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ లోని అన్ని రకాల రికార్డులను పరిశీలించారు. క్రైమ్ రేటును తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ అధికారులను ఆదేశించారు. మట్టి, ఇసుక అక్రమంగా రవాణా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ రామసుబ్బయ్య, ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.