పర్యావరణాన్ని కాపాడుకోవటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖమాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం.ఒంగోలు నగరంలో ఐదువేల మొక్కలను నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు., ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ముందుగా ఒంగోలు మార్కెట్ యార్డ్ సమీపంలోని ఆచార్య ఎన్జీరంగా విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంజయ్య రోడ్డులో కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణలతో కలిసి మొక్కలు నాటారు.