ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గురువారం రోడ్డు ప్రమాదాలపై పోలీసు అధికారులు వాహనా దారులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మూలమలుపును తిరిగే సమయంలో వాహనదారులు ఇండికేటర్లు ఉపయోగించి వెనక వచ్చే వాహనదారులకు సందేశాలు అందించాలని తెలిపారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా ఇద్దరు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై ప్రయాణించాలని వాహనదారులకు పోలీసులు తెలపడంతో పాటు నిబంధనలు ఉలంగిస్తే జరిమానాలు విధిస్తామని తెలిపారు.