నంద్యాల జిల్లా బేతంచెర్ల పరిధిలో సరైన రికార్డులు, వే బిల్లులు లేకుండా నాపరాయి తరలిస్తున్న ఐదు లారీలను మైన్స్ విజిలెన్స్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. గురువారం పోలీసులు, సీనరిజీస్ కలెక్షన్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నాపరాయి రవాణా చేస్తున్న లారీలను స్వాధీనం చేసుకున్నట్లు మైన్స్ విజిలెన్స్ అధికారులు సాంబశివారెడ్డి, దిలీప్ కుమార్ తెలిపారు.