పూతలపట్టు: ఐరాల మండలంలో వికలాంగుడికి అన్యాయం ఎంపీడీవోను నిలదీసిన జేఏసీ నేతలు
వికలాంగుడికి అన్యాయం.. ఎంపీడీవోను నిలదీసిన జేఏసీ నేతలు ఐరాల మండలం ముదిగోళం సచివాలయానికి చెందిన వికలాంగుడు గోవింద గౌడ్ పెన్షన్ తగ్గింపుపై వివాదం చెలరేగింది. 70% వైకల్యం నుంచి 40%కి తగ్గించడంతో ₹15,000 పెన్షన్ ₹6,000కి తగ్గింది. అప్పీల్ చేసినా వెల్ఫేర్ అసిస్టెంట్ నిర్లక్ష్యంతో ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో ఈ పరిణామం జరిగింది. జేఏసీ నేతలు ఎంపీడీవోను నిలదీసి బాధ్యుడిపై చర్య తీసుకోవాలని, బకాయి పెన్షన్ జీతం నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు.