గిద్దలూరు: కొమరోలు మండలం చింతలపల్లి పంచాయతీలో సెప్టెంబర్ 15 సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడి
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని చింతలపల్లి పంచాయతీలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా సోమవారం అనగా సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని స్థానిక ప్రజలు రైతులు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.