మంగళగిరి: ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీమ్
అన్సారియా
డీఎస్సీ నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం దగ్గర డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సంబంధిత ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగర పాలక కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి లతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం ఉదయం పరిశీలించారు.