నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో మంగళవారం కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది, రైతులు మొక్కజొన్న పంటను నూర్పిడి చేసి ఆరబెట్టుకున్నారు, వర్షం రావడంతో పంట తడిసిపోయింది అని రైతులు విచారణ వ్యక్తం చేస్తున్నారు, ఆశించిన దిగుబడి రాకపోవడం, దానికి తోడు ధర లేక దిగాలు చెందుతున్న సమయంలో ఈ వర్షం మరింత నష్టాన్ని మిగిల్చిందని రైతులు వాపోతున్నారు