గజపతినగరం: పెదమనాపురం టోల్గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ చక్రాలకిందపడి హిజ్రా అక్కడికక్కడే మృతి: కేసునమోదు చేశామన్న ఎస్ ఐ
దత్తిరాజేరు మండలం పెదమాపురం టోల్గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి హిజ్రా అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆదివారం రాత్రి పెదమానాపురం పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదమనాపురం ఎస్ ఐ జయంతి విలేకరులకు తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హిజ్రా కు సంబంధించిన వివరాలు తెలియవలసి ఉందని ఆమె పేర్కొన్నారు.