ఆగ్రో చైర్మన్ అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ స్వామి
Ongole Urban, Prakasam | Oct 20, 2025
సుబ్బానాయుడు వంటి నిబద్ధత, అంకిత భావం కలిగిన కుటుంబ సభ్యున్ని టీడీపీ కోల్పోయిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా దగదర్తిలో ఆగ్రోస్ చైర్మన్, టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి డా.స్వామి పాల్గొన్నారు. సుబ్బానాయుడు మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యుల్ని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.....సుబ్బానాయుడు మృతి బాధాకరం,సుబ్బానాయుడు పార్టీకి చేసిన సేవలు ఎనలేనివి, ఆయన మృతి పార్టీకి తీరని లోటు అన్నారు