ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఓయూలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, మేయర్ విజయలక్ష్మి విహెచ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రణాళికలు, కొత్త భవనాల నిర్మాణం పై నిర్ణయం సీఎం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.