పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల కల నెరవేరిందని ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. బుధవారం మార్కాపురం లో జిల్లా ఏర్పాటు సందర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు అప్పట్లో ఎన్నికల ముందు జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా చేశారని అన్నారు. పశ్చిమ ప్రకాశ ప్రాంతమైన మార్కాపురం డివిజన్ ప్రాంతం జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి చెందుతుందని నరసింహారెడ్డి పేర్కొన్నారు.