శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తరఫున వనభోజనాలు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం కార్తీకమాసం చివరి రోజు సందర్భంగా వన భోజనాలు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ భరద్వాజ తీర్థం (లోబావి)లో ఈ వన భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ బాపిరెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ కొట్టేసాయి, కమిటీ సభ్యులు ఆలయ అధికారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.