తాడిపత్రి: కిష్టిపాడులో ఆన్లైన్ మట్కా ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, రూ.15,120 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు
పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో సోమవారం రాత్రి ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఓ ప్రాంతంలో ఆన్లైన్ మట్కా ఆడుతున్న రషీద్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.15,120 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పై ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.