కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని సబ్ జైలును శనివారం జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి భార్గవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఖైదీల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. సబ్ జైలు లోని స్టోర్ రూమ్ను తనిఖీ చేశారు. డిసెంబర్ 12వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాల్సినదిగా వివరించారు.