ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శనివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు పోలీస్ స్టేషన్ కి వాహన యజమానులను పిలిపించి వారికి వార్నింగ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనం నడుపుతూ మైనర్ ప్రమాదం చేస్తే వాహనం నడుపుతున్న మైనర్ తో పాటు వాహనం ఇచ్చిన వాహన యజమానిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు యజమానులను హెచ్చరించారు. అంతేకాకుండా వాహన యజమానులకు జరిమానా కూడా విధించారు.