ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం రైతులు 1442 బేళ్ళు అమ్మకానికి తీసుకువచ్చారు. వాటిలో 979 బేళ్ళు మాత్రమే కొనుగోలుచేసి 463 బేళ్ళను వివిధ కారణాలతో తిరస్కరించారు. సాధారణ కోటా అయిపోయి అపరాధ రుసుముతో 15వ రౌండ్ పొగాకు కొనుగోలు జరుగుతోందని రైతులు తెలిపారు. తిరస్కరణ సంఖ్య తగ్గడంలేదని వాపోతున్నారు. లోగ్రేడ్ ధరలు పూర్తిగా దిగజారాయని అన్నారు.