గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వేయాలని కళ్యాణదుర్గం పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశించారు. కళ్యాణదుర్గంలోని డీఎస్పీ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్ లను మంగళవారం తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, జూదాలు జరుగుతున్నట్లయితే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐలు గణేష్, నీలకంఠేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.