రోడ్డు భద్రత నియమాలు పాటించడం వల్ల మీకు మీపై అధారపడ్డ కుటుంబానికి ఎంతో క్షేమకరమని కొత్తపల్లి ఎస్ఐ జయశేఖర్ వాహనదారులకు సూచించారు, సోమవారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని దుద్యాల గ్రామ సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించారు,ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల భద్రత జీవితాలకు రక్షణగా నిలుస్తుంది అన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేటప్పుడువాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడకూడదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతిఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యాలకు చేరుకోవాలన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించ