అనంతపురం నగర శివారులోని పంగల్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా, నాయక్ నగర్ కు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 14, 2025
అనంతపురం నగర శివారులోని పంగల్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నగరంలోని నాయక్ నగర్ కు చెందిన రవీంద్రనాయక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.