మైనర్ బాలిక అదృష్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం నల్లంగాడు గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కుమార్తె ఎన్.హారిక(వయసు 16సం రాలు)ఈ నెల 18వ తేదీ మంగళవారం నుండి కనిపించకుండా పోవడం జరిగింది.చిత్తూరు కొంగారెడ్డిపల్లిలోని విద్యా జూనియర్ కాలేజీలో చదువుకొనుచూ కాలేజీకి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లి ఇంటికి రాక పోవడంతో గురువారం బాలిక తల్లి కవిత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.