యాడికి మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు బుధవారం రాత్రి మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. యాడికి ఎంపీటీసీ అవుకు నాగరాజు, సీనియర్ నాయకులు శ్రీరంగా ,బాలచైతన్య, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సూర్యనారాయణ రెడ్డి తదితరులు కలిశారు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి కాసేపు చర్చించారు. పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని వైయస్ జగన్ సూచించినట్లు నాయకులు చెప్పారు.