ఏలూరు నగరంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన తూర్పు వీధి శ్రీ గంగానమ్మ జాతర (జనంతో జాతర) మహోత్సవంలో భాగంగా మంగళవారం అమ్మవారికి 10 లక్షల చిట్టిగాజులతో సుమారు 1000 మంది మహిళలతో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గాజుల పూజలో 1000 మంది ప్రత్యక్షంగా 1000 మంది పరోక్షంగా పాల్గొన్నారని జాతర నిర్వాహకులు వంటినేని భాను తెలిపారు.