సాక్షి పత్రిక పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ఖండిస్తూ తాడిపత్రిలో రెవెన్యూ కార్యాలయం వద్ద శుక్రవారం జర్నలిస్టులు, సీపీఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు, సీపీఐ నాయకులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరించి వేస్తున్నదన్నారు. ఒకవేళ అసత్య కథనాలు ప్రచురితం చేసి ఉంటే లీగల్ గా వెళ్లాలన్నారు. అంతేతప్ప కక్ష సాధింపు చేయకూడదన్నారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ సోమశేఖర్ కు అందజేశారు.