నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని సాగర్ కాలనీలో పిచ్చికుక్క స్వైర విహారం ఏడుగురుపై దాడి
Nirmal, Nirmal | Sep 16, 2025 నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ సాగర్ కాలనీ లో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఏడుగురు మహిళలతోపాటు ఓ చిన్నారిని గాయపరిచింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వృద్ధ మహిళలు, మహిళలపై దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో వెంటనే క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేశారు. పిచ్చికుక్క కాలనీలో దాడికి పాల్పడుతుండడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది సమ్మెలో ఉన్నారని మాట దాట వేస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.