మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గూడరేవుపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గూడరేవుపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పిఎసి మెంబర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు.పీలేరు నియోజకవర్గంలోని పీలేరు మండలం తలుపుల, గూడరేవుపల్లి,జాండ్ల గ్రామ పంచాయతీల నందు రచ్చబండ కార్యక్రమాన్ని పిఎసి మెంబర్,మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో వివరించారు.తదుపరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు.