మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, బాచుపల్లి మండలం, నిజాంపేట సర్వే నెంబర్ 191 లో కబ్జా అయినా పదేకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీని విలువ 750 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. స్థానికుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన హైడ్రా అక్రమణాలను నిర్ధారించింది. శాశ్వత నివాసాలు మినహా షెడ్లు, ప్రహరీలను తొలగించి, ఆ 10 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డులు ఏర్పాటు చేసింది.