హైదరాబాదులోని పలుచోట్ల ఏసీబీ మెరుపు దాడి చేసింది. కూకట్పల్లి, మూసాపేట్, కుత్బుల్లాపూర్, సూరారం, శేర్లింగంపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఒకేసారి ఏసీబీ అధికారులు గేట్లు క్లోజ్ చేసి ఫైలు చెక్ చేస్తున్నారు. ఉదయం నుంచి కార్యాలయాలను అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ల పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోదాలు జరుగుతున్నాయి. ఎవరూ రాకుండా అధికారులు గేట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.