ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం, అర్ధవీడు మండలం గన్నేపల్లి వద్ద అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి, మరొకరికి గాయాలు
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సుకు దారీ ఇచ్చే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందిన మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కడప జిల్లా బద్వేల్ కు చెందిన ముత్యాల శ్రీనుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ కుమార్ అనే మరో వ్యక్తి కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.